Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:09 IST)
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా చిన్నసేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) అనే మహిళ భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. దీంతో కవితాదేవి తన 16 యేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో కవితాదేవి అదే ప్రాంతానికి చెందిన గ్రామ సహాయకుడు రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె భాగ్యలక్ష్మి కనిపెట్టి తల్లితో పాటు రాజేంద్రన్‌ను నిలదీసింది. 
 
దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిని చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments