Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం పళణిస్వామి

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:36 IST)
గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ వర్షాల ధాటికి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో హైదరాబాదులో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం పళణిస్వామికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన తమిళనాడు సీఎం భారీ వర్షాలు వరదలతో నష్టపోవడం విచారకరమన్నారు.
 
తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజలకు దుప్పట్లు, చాపలు పంపిణీ చేస్తామని, సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణమే 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
 
వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినందుకు గాను తమిళనాడు సీఎం పళణిస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments