Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి పిలిచి తండ్రీకొడుకు బలాత్కారం చేశారు.. గాయని ఫిర్యాదు..

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (16:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నిషద్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, అతని కుమారుడుపై ఓ గాయని లైంగిక ఆరోపణలు చేశారు. గత 2014లో ఎమ్మెల్యే ఇంటికి పిలిచారనీ, దీంతో తాను ఇంటికి వెళ్లగా, తండ్రీతనయులు మార్చిమార్చి అత్యాచారం చేశారని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడుపై కేసు నమోదు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 2014లో నిషద్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల బాధిత గాయ‌నిని తన ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో విజయ్‌ మిశ్రా, అతడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనను బెదిరించారని బాధితురాలు ఇపుడు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే, 2015లో వారణాసిలో ఒక హోటల్‌లో ఎమ్మెల్యే మరోసారి బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు బధోహి ఎస్పీ రామ్‌ బదన్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం మిశ్రా ఆమెను ఇంటి దగ్గర వదిలేయమని కొడుకు, మేనల్లుడికి చెప్పారని.. అయితే వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, ఈ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మిశ్రాపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన భూమిని ఆక్రమించుకున్నారన్న కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో గాయని... ఆయనపై గోపిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. "విజయ్‌ మిశ్రా వద్ద నా వీడియో క్లిప్‌ ఉంది. ఆయన మీద అనేక కేసులు ఉన్నప్పటికి ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి నేను భయపడ్డాను" అని చెప్పుకొచ్చింది. గాయని చేసిన ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం