కేంద్రానికి షాకిచ్చిన పళనిస్వామి.. 3కాదు.. ద్విభాషా విధానానికే గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (13:11 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రానికి షాక్ ఇచ్చారు. కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన ఈ కొత్త విద్యా విధానంలో ప్రతిపాతించిన త్రిభాషా విధానం తమకు ఆమోదయోగ్యం కాదని పళని స్వామి స్పష్టం చేశారు. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...కేంద్రం తీసుకొస్తున్న కొత్త జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. 
 
ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలులో ఉన్న ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తామని ఓ ప్రకటనలో పళనిస్వామి స్పష్టం చేశారు. త్రిభాషా విధానం తమిళ ప్రజల మనోభిప్రాయాలకు వ్యతిరేకమని... ఈ మేరకు కొత్త విద్యా విధానంలో మార్పులు చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. 
 
ఎలాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలన్నది రాష్ట్రాల నిర్ణయానికే విడిచిపెట్టాలని కేంద్రాన్ని కోరారు. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గతంలో తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని సీఎం పళనిస్వామి గుర్తుచేశారు.
 
కొత్త విద్యా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యా సంస్కరణల పేరుతో హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా తమపై రుద్దే కుట్ర జరుగుతోందని, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments