Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు చోరీ!!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఢిల్లీలోని ఓ సర్వీస్ సెంటర్ నుంచి ఈ ఎస్‌యూవీ కారు మాయమైంది. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్న టాటా ఫార్చునర్‌ను ఈ నెల 19వ తేదీన కారు డ్రైవర్ గోవింద్‌పురిలోని ఓ సర్వీస్ సెంటరులో సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు తిరిగి వచ్చేలోపు కారు కనిపించలేదు. దీనిపై కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. 
 
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారు ఎటు వెళ్లిందో ఆచూకీ గుర్తించారు. ఈ కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు తెలుసుకున్నారు. అయితే, కారు జాడను మాత్రం ఇంకా కనిపెట్టలేదు. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు వెల్లిడించారు. త్వరలోనే కారుతో పాటు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కారు నడ్డా సతీమణి పేరు మీద హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టరైనట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments