Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు చోరీ!!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఢిల్లీలోని ఓ సర్వీస్ సెంటర్ నుంచి ఈ ఎస్‌యూవీ కారు మాయమైంది. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్న టాటా ఫార్చునర్‌ను ఈ నెల 19వ తేదీన కారు డ్రైవర్ గోవింద్‌పురిలోని ఓ సర్వీస్ సెంటరులో సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు తిరిగి వచ్చేలోపు కారు కనిపించలేదు. దీనిపై కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. 
 
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారు ఎటు వెళ్లిందో ఆచూకీ గుర్తించారు. ఈ కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు తెలుసుకున్నారు. అయితే, కారు జాడను మాత్రం ఇంకా కనిపెట్టలేదు. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు వెల్లిడించారు. త్వరలోనే కారుతో పాటు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కారు నడ్డా సతీమణి పేరు మీద హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టరైనట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments