Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో కొత్త వైరస్ కలకలం.. 4800 పందులు మృతి

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (11:01 IST)
ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో వందలాది పందులు మృత్యువాతపడుతున్నాయి. ముఖ్యంగా, ఇక్కడి పందుల్లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ (ఏఎస్‌ఎఫ్‌) ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
దీనివల్ల రాష్ట్ర రైతులకు దాదాపు రూ.19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 21న లంగ్‌లై జిల్లా లంగ్‌సేన్‌ గ్రామంలో బయటపడిన ఈ వ్యాధి ప్రస్తుతం 9 జిల్లాలకు వ్యాపించింది. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్‌ ఫీవర్‌ ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. 
 
ఇందులో ఒక్క ఆయ్‌జోల్‌ జిల్లాలోనే 55 గ్రామాలున్నాయి. స్వైన్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 32 వేల పందులున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రబలని ప్రాంతాల్లోనూ 100కు పైగా పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి. అయితే పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments