Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే
, బుధవారం, 12 ఆగస్టు 2020 (09:59 IST)
Mizoram MLA
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఎమ్మెల్యే పురుడు పోశారు. ఎమ్మెల్యే సమయానికి స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మిజోరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిజోరంలోని చాంఫై నార్త్‌ ఎమ్మెల్యే జడ్‌ఆర్‌ థైమ్సంగా సోమవారం తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 
 
ఇటీవల సంభవించిన భూకంపాలు, కరోనా వైరస్‌ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్‌ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. 
 
వృత్తిరీత్యా గైనకాలజీస్ట్ అయిన థైమ్సంగా చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్‌ చేశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్‌ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంటల్లో ప్రైవేట్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడ?