Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. రిజర్వేషన్లూ ముఖ్యమే : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:08 IST)
విద్యార్థుల ప్రతిభతకు కేవలం మార్కులు మాత్రమే ముఖ్యం కాదనీ రిజర్వేషన్లు కూడా ముఖ్యమేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అపెక్స్ కోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వైద్య విద్య కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్‌లో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. 
 
ఈ మేరకు ఈ నెల 7వ తేదీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాకుండా, 2021-22 అడ్మిషన్లలో రిజర్వేషన్లు యదాతథంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. 
 
ఒక విద్యార్థి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధించి తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఈ రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ, సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇది మరింతగా పెంచుతుందని న్యాయమూర్తులు చంద్రచూడ్, బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల 2021-22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments