Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్‏కు కైకాల సత్యనారాయణ లేఖ

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:46 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం చూపిన చొరవపై రియాక్ట్ అయ్యారు. గత నవంబర్ నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన కైకాల.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 
 
ఆ సమయంలో వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి ఆరా దీశారు.
 
అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న కైకాల సత్యనారాయణ సీఎం జగన్‏కు ఓ లేఖ రాస్తూ.. తన అనారోగ్య సమయంలో సాయం అందించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం హర్షమని చెప్పారు. 
 
ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తన బాగోగులు తెలుసుకోవడం, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇవ్వడం, మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా సాయం అందించడం ఆనందంగా ఉందని కైకాల చెప్పారు. 
 
కష్ట సమయంలో మీరు అందించిన సహాయం తనకు, తన కుటుంబానికి ఎంతో శక్తినిచ్చిందని కైకాల తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అనారోగ్య సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments