వైఎస్ జగన్‏కు కైకాల సత్యనారాయణ లేఖ

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:46 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం చూపిన చొరవపై రియాక్ట్ అయ్యారు. గత నవంబర్ నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన కైకాల.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 
 
ఆ సమయంలో వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి ఆరా దీశారు.
 
అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న కైకాల సత్యనారాయణ సీఎం జగన్‏కు ఓ లేఖ రాస్తూ.. తన అనారోగ్య సమయంలో సాయం అందించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం హర్షమని చెప్పారు. 
 
ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తన బాగోగులు తెలుసుకోవడం, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇవ్వడం, మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా సాయం అందించడం ఆనందంగా ఉందని కైకాల చెప్పారు. 
 
కష్ట సమయంలో మీరు అందించిన సహాయం తనకు, తన కుటుంబానికి ఎంతో శక్తినిచ్చిందని కైకాల తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అనారోగ్య సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments