Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకటించిన తేదీల్లోనే పీజీ నీట్ పరీక్ష - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:14 IST)
దేశంలోని పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు విద్యార్థుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు నష్టం కలిగించేలా ఆదేశించలేమని పేర్కొంది. వాయిదా వేస్తే ఇప్పటికే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. 
 
పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికి పైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదావేసి వారికి నష్టం చేకూర్చలేమని పేర్కొంది. అలా చేయడం వల్ల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీతో పాటు ఏ యేడాది కౌన్సెలింగ్ తేదీలు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకని నీట్ 2022-23ను ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు కూడా 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని ధర్మాసనం గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments