Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిది లైంగిక వేధింపులు... వదిన ఆత్మహత్య.. నోరు మెదపని భర్త

లైంగిక వేధింపులకు మరో వివాహం ఆత్మహత్య చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లోగల మధుబన్ కాలనీలో 30 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (14:00 IST)
లైంగిక వేధింపులకు మరో వివాహం ఆత్మహత్య చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లోగల మధుబన్ కాలనీలో 30 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మరిది లైంగికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
భార్య మృతిపై భర్త మాత్రం నోరు మెదపడం లేదు. భార్య మృతదేహం దగ్గర మౌనంగా కూర్చొండిపోయాడు. పోలీసులు అడిగే ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా జవాబు చెప్పేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కోడలి మృతిపై అత్త జస్బీర్‌కౌర్ మాట్లాడుతూ 'నేను వంట గదిలో ఉన్నాను. ఫ్యానుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి నా చిన్న కుమారుడు చూసి నాకు చెప్పాడు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాన్ని కిందకుదించాం. అప్పటికే ఆమె చనిపోయింది. ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు. అయితే నా కొడుకు, కోడలు మద్యానికి బానిసయ్యారు' అని చెప్పుకొచ్చారు. 
 
కాగా, మృతురాని నాలుగేళ్ల కొడుకు తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తుండటం అందరినీ కంటతడిపెట్టించింది. ఈ కేసులో భర్తతో పాటు.. అత్త జస్బీర్ కౌర్, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం