Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్ష.. లో-దుస్తులను విప్పించి.. పరీక్షా గదికి..?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:13 IST)
దేశ వ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుంటే, మరోవైపు అవమానకరంగా వందమంది అమ్మాయిల లో-దుస్తులను విప్పించి, పరీక్ష గదికి పంపించారు. దాంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలు అవమానం తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయ్యారు. 
 
పరీక్ష అనంతరం వారికి జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు సదరు కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాలోకి వెళ్తే.. కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిల పట్ల అక్కడి సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారు. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ అధికారులు నీట్ పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. 
 
అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది అమ్మాయిలను లోదుస్తులతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
 
కానీ, లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర పరిస్థితుల్లో ఆ అమ్మాయిలు తమ లోదుస్తులు విప్పేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. 
 
పరీక్ష ముగిసిన తర్వాత తమకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కాలేజీ యాజమాన్యంపై భగ్గుమన్నారు. కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments