Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతను గొడ్డళ్ళతో నరికేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతను వైకాపా మూకలు గొడ్డళ్ళతో నరికివేశారు. జిల్లాలోని రొంపిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్ళతో దాడి చేశారు. 
 
ఆయన మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో మాటేసిన కొందరు దండగులు బాలకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స కోసం నర్సారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
మరోవైపు, బాలకోటిరెడ్డిపై దాడిని తెదేపా నేతలు ఖండించారు. సీఎం జగన్ రెడ్డి ప్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైకాపా కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 
 
ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైకాపా నేతలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments