Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (13:24 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు కోసం ఓ యువతి దేశ సరిహద్దులను దాటి వచ్చింది. తన ప్రియుడు ఉన్న చోటికి వచ్చిన ఆ యువతి ఏకంగా అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులు గమనించి పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్‌వార్ ప్రాంతానికి చెందిన రిషేవి అనే యువతి జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయమయ్యాడు. 
 
ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై రిషేవి చెన్నైకి వచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని కలుసుకుని, అతనితోనే ఉండసాగింది. ఈ విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. 
 
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్‌నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments