Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (13:24 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు కోసం ఓ యువతి దేశ సరిహద్దులను దాటి వచ్చింది. తన ప్రియుడు ఉన్న చోటికి వచ్చిన ఆ యువతి ఏకంగా అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులు గమనించి పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్‌వార్ ప్రాంతానికి చెందిన రిషేవి అనే యువతి జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయమయ్యాడు. 
 
ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై రిషేవి చెన్నైకి వచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని కలుసుకుని, అతనితోనే ఉండసాగింది. ఈ విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. 
 
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్‌నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments