తమిళనాడు (తెలుగు) మంత్రి కె.బాలకృష్ణా రెడ్డికి మూడేళ్ల జైలు

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (17:16 IST)
తమిళనాడు రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ళ జైలుశిక్ష పడింది. ఈయన హోసూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, రెడ్డి సామాజికవర్గానికి చెందిన తెలుగు మంత్రి. ఇంతకీ ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష ఎందుకు పడిందో తెలుసా...? బస్సులపై రాళ్ళు విసిరి ధ్వంసం చేసిన కేసులో ఆయనకు జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 
 
గతంలో కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని భాగనూరులో (కర్ణాటక సరిహద్దు ప్రాంతం) కల్తీసారాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఇందులో బాలకృష్ణా రెడ్డితో పాటు.. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులు రాళ్లురువ్వి బస్సులను ధ్వంసం చేశారు. 
 
ఈ కేసు విచారణ కృష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తిగా, సోమవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్టు మంత్రి బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments