Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి షాకిచ్చిన కేంద్రం : గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి నో ప్లేస్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (17:02 IST)
దేశగణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రతి యేడాది దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ పేరెడ్ నిర్వహిస్తుంది. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శనగా వెళతాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న శకటం ప్రతి యేడాది మన్నలు అందుకుంది. కానీ, ఈ నెల 26వ తేదీన జరుగనున్న వేడుకలకు మాత్రం ఏపీ శకటానికి చోటుదక్కలేదు.
 
నిజానికి ప్రతి యేటా ఈ వేడుకల కోసం ఆయా రాష్ట్రాలు ఎలాంటి నమూనాలు పంపుతున్నాయన్న దానిపై ముందుగానే రక్షణ శాఖకు వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఆర్మీ అధికారులు డిజైన్‌ను ఆమోదించిన తర్వాత శకటాన్ని సిద్ధం చేసి పంపిస్తారు. నిపుణుల కమిటి తుది పరిశీలన తర్వాత అంతా బాగుంది అనుకుంటే వాటికి పేరేడ్‌లో అవకాశం కల్పించేది లేదనిదీ స్పష్టంచేస్తారు. 
 
కానీ, ఏపీకి సంబంధించిన శకటం డిజైన్‌ ఈ దఫా కూడా అందరి మన్నలు అందుకుంది. కానీ, చోటు దక్కలేదు. ఇది ఏపీ సర్కారును షాక్‌కు గురిచేసింది. ఆఖరు నిమిషంలో ఎందుకిలా జరిగిందో తమకు అర్థం కావడంలేదని ఏపీ భవన్ అధికారులు వాపోతున్నారు. ఏపీ సర్కారు గాంధీ కొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహం అంశాలతో డ్రాయింగ్ తీసి పంపించింది. వాటిని త్రీడీ మోడల్‌ను, సంగీతాన్ని కూడా జతచేసింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఏపీ డిజైన్‌ను రక్షణ శాఖ వర్గాలు ఆమోదించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments