Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం : మాయావతి ఫైర్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:38 IST)
తమ ఎమ్మెల్యేలను లాక్కున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్‌కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

మాయావతి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించి బీఎస్పీ గతంలోనే కోర్టును ఆశ్రయించిందని, అయితే కాంగ్రెస్‌ పార్టీకి, సిఎం గెహ్లాట్‌కు బుద్ధి చెప్పేందుకు తాము సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న అంశాన్ని ఇప్పుడు అంత తేలికగా వదిలేయబోమని, సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు.

గెహ్లాట్‌ తప్పులు కాంగ్రెస్‌ నేతలకు కనిపించవని, బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్‌కు తాము మద్దతు ప్రకటించామని, అయితే రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments