Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం : మాయావతి ఫైర్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:38 IST)
తమ ఎమ్మెల్యేలను లాక్కున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్‌కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

మాయావతి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించి బీఎస్పీ గతంలోనే కోర్టును ఆశ్రయించిందని, అయితే కాంగ్రెస్‌ పార్టీకి, సిఎం గెహ్లాట్‌కు బుద్ధి చెప్పేందుకు తాము సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న అంశాన్ని ఇప్పుడు అంత తేలికగా వదిలేయబోమని, సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు.

గెహ్లాట్‌ తప్పులు కాంగ్రెస్‌ నేతలకు కనిపించవని, బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్‌కు తాము మద్దతు ప్రకటించామని, అయితే రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments