కన్నీరు కార్చడం కాదు.. బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలి.. సోనూసూద్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (06:22 IST)
ఒడిశా రైలు ప్రమాదంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కరోనా ఆపద్భాంధవుడు, సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైనదని సోనూ అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం తెలపడంతో పాటు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు కేవలం సోషల్ మీడియాలో కన్నీరు కార్చినంత మాత్రాన ఏమీ లాభం లేదని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలన్న సోనుసూద్ అన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుపై సోనూసూద్ అభినందించారు. 
 
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని సోను సూద్ డిమాండ్ చేశారు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం ఉండేలా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments