Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా ఘటన.. 316 మంది ఏపీ వాసులు సేఫ్.. మంత్రి బొత్స ప్రకటన

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (05:59 IST)
ఒడిశాలోని బాలోసార్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 300మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతూనే వున్నాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హవ్‌డాలో 300 మందికి పైగా ఏపీ వాసులు ప్రయాణించారు. ఇందులో కోరమాండల్‌లో జర్నీ చేసిన 267 మంది ఏపీ వాసుల్లో 20మంది స్వల్ప గాయాలకు గురయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సర్కారు తెలిపింది. 
 
ఇక చివరి బోగీలు పట్టాలు తప్పిన హవ్ డా లో ప్రయాణించిన 49 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి 316 మంది సురక్షితంగా ఏపీ వాసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్ రెడ్డి, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపించినట్లు చెప్పారు.
 
రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతులను త్వరితగతిన తీసుకు రావాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments