ఒడిశా ఘటన.. 316 మంది ఏపీ వాసులు సేఫ్.. మంత్రి బొత్స ప్రకటన

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (05:59 IST)
ఒడిశాలోని బాలోసార్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 300మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతూనే వున్నాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హవ్‌డాలో 300 మందికి పైగా ఏపీ వాసులు ప్రయాణించారు. ఇందులో కోరమాండల్‌లో జర్నీ చేసిన 267 మంది ఏపీ వాసుల్లో 20మంది స్వల్ప గాయాలకు గురయ్యారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఏపీ సర్కారు తెలిపింది. 
 
ఇక చివరి బోగీలు పట్టాలు తప్పిన హవ్ డా లో ప్రయాణించిన 49 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి 316 మంది సురక్షితంగా ఏపీ వాసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్ రెడ్డి, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపించినట్లు చెప్పారు.
 
రైలు ప్రమాదంలో క్షతగాత్రులను, మృతులను త్వరితగతిన తీసుకు రావాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments