కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఈ నలుగురిలో మీ ఓటు ఎవరికి.. పోల్ పెట్టిన సోనియా

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:56 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక త్వరలో జరుగనుంది. ఇందుకోసం ఆ పార్టీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నలుగురు పేర్లను ఎంపిక చేసిన పోల్ నిర్వహిస్తారు. ఈ నలుగురిలో తన కుమార్తె ప్రియాంకా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్ (మధ్యప్రదేశ్ సీఎం), శశిథరూర్, సచిన్ పైలెట్‌లు ఉన్నారు. 
 
స్వయంగా సోనియా గాంధీ ప్రతిపాదించిన ఈ జాబితాలో రాహుల్ గాంధీ పేరు కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఈ నలుగురిలో ఎవరికి మీ ఓటు అని సోనియా గాంధీ పోల్ పెట్టారు. ఈ నలుగురిలో పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ ఆమె పోస్ట్ చేశారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు ఆయన మొండికేశారు. దీంతో సోనియా కొత్తగా నలుగురు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో రాహుల్ లేకపోవడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments