Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారాం ఆస్పత్రిలో చికిత్స

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (13:26 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ యేడాదిలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఇదే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ యేడాది జనవరి 12వ తేదీన వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఐదు రోజుల తర్వాత 17వ తేదీన ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మార్చి 2వ తేదీన అదే ఆస్పత్రిలో ఆమె చోరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ముంబై నగరంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అక్కడ నుంచి ఢిల్లీకి చేరిన తర్వాత ఆమె అంతలోనే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments