Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం అత్త ముక్కును కొరికిన అల్లుడు

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (17:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ అల్లుడు అత్త ముక్కును కొరికేశాడు. అలాగే, ఆయన తండ్రి ఆమె చెవిని కొరికేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బరేలీకి చెందిన రెహ్మాన్‌, గుల్షాన్‌ దంపతుల కుమార్తె చాంద్‌ బీకి ప్రాపర్టీ డీలర్‌ అయిన మహ్మద్‌ ఆష్ఫక్‌తో ఒక యేడాది క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద మహ్మద్‌కు రూ.10 లక్షలు ఇచ్చారు. 
 
ఒక యేడాది లోపే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులు అదనంగా మరో రూ.5 లక్షలు తేవాలని చాంద్‌ బీని డిమాండ్‌ చేశారు. ఇందుకు రెహ్మాన్‌ అంగీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో తన భార్య చాంద్ బీని తీసుకుని మహ్మద్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అదనపు కట్నం విషయంపై వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్ అత్త గుల్షాన్‌ ముక్కును కొరికేశాడు. ఆమె చెవిని మహ్మద్ తండ్రి కొరకడమే కాకుండా, కత్తితో కత్తిరించాడు. 
 
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ లోపే మహ్మద్‌, అతని తండ్రి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments