Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:16 IST)
తిరువనంతపురం - నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము కనిపించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-5 బోగీ బెర్తు కింద లగేజీ మధ్యలో ఇది కనిపించింది. దీన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే టీసీకి సమాచారం ఇచ్చారు. ఆయన తదుపరి స్టేషనులో రైలును నిలిపివేశారు. ఆ తర్వాత పాములు పట్టేవారిని తీసుకొచ్చి బోగీ మొత్తం గాలించగా పాము లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు కదిలివెళ్లిపోయింది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్5 బోగీ బెర్త్ కింద లగేజీ మధ్యలో పాటు ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గురించారు. ఈ విషయాన్ని వారు టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తర్వాతి స్టేషను కోళికోడ్‌లో రెండు గంటల పాటు నిలిపివేశారు. 
 
ఈ రైలు స్టేషనులో ఆగటమే ఆలస్యం.. ఆ బోగీలోని ప్రయాణికులంతా ఉక్కసారిగా రైలు దిగేశారు. తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి బోగీ మొత్తం గాలించినా దాని జాడ కనిపించలేదు. రైలు బోగీలని రధ్రం ద్వారా కిందకు వెళ్లిపోయివుంటుందని రైలు అధికారులు భావించారు. అయితే, ఇది విష సర్పం కాదని, తమ ఫోన్లలో తీసిన పాము ఫోటోలను పరిశీలించి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments