Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి ప్యాకేజీ-1 పనుల్లో విషాదం ... క్రేన్ వైరు తెగిన ఐదుగురు కూలీల దుర్మణం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (09:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రంగారెడ్డి ప్యాకేజీ-1 ఇర్రిగేషన్ పనుల్లో ఈ ఘటన జరిగింది. కొందరు కూలీలు పంప్ హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులంతా బీహార్ రాష్ట్ర కూలీలుగా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి ప్యాకేజీ-1 పనులు చేసేందుకు కూలీలు ఉపక్రమించారు. ఇందుకోసం కొందరు కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments