Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ జలప్రళయంలో 37మంది ఏపీ ప్రయాణీకుల గల్లంతు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:28 IST)
జమ్మూకాశ్మీర్ అమర్ నాథ్ జలప్రళయంలో ఏపీకి చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించలేదు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితోపాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమండ్రికిచెందిన ఇద్దరు మహిళల సహా 37 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
అమర్‌నాథ్‌ యాత్రలో వరదల తర్వాత పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వారి అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు.. తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆచూకీ లభించని వారి విషయంలో మాత్రం ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.
 
అమర్‌నాథ్‌‌లో గల్లంతైన ఏపీ వాసుల సమాచారాన్ని.. ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్న ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్‌కు అందజేశారు. ఆయన అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఏపీ వాసుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం, ఫోన్ చార్జింగ్ అయిపోవడం వంటి కారణాల వల్ల సరైన సమాచారం అందడం లేదని, తద్వారా గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments