Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ జలప్రళయంలో 37మంది ఏపీ ప్రయాణీకుల గల్లంతు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:28 IST)
జమ్మూకాశ్మీర్ అమర్ నాథ్ జలప్రళయంలో ఏపీకి చెందిన 37 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించలేదు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బృందాలుగా వెళ్లిన 29 మందితోపాటు ఏలూరు నుంచి ఇద్దరు, తణుకు సమీపంలోని ఉండ్రాజవరం నుంచి ఒకరు, రాజమండ్రికిచెందిన ఇద్దరు మహిళల సహా 37 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
అమర్‌నాథ్‌ యాత్రలో వరదల తర్వాత పలువురు తెలుగు యాత్రికుల క్షేమ సమాచారాలు అందకపోవడంతో స్థానిక రెవెన్యూ అధికారులు వారి అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఇళ్లకు వెళ్లి విచారిస్తున్నారు. 
 
ఈ క్రమంలో కొందరు.. తమ బంధువులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆచూకీ లభించని వారి విషయంలో మాత్రం ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని బంధువులు చెబుతున్నారు.
 
అమర్‌నాథ్‌‌లో గల్లంతైన ఏపీ వాసుల సమాచారాన్ని.. ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్న ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్‌కు అందజేశారు. ఆయన అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఏపీ వాసుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం, ఫోన్ చార్జింగ్ అయిపోవడం వంటి కారణాల వల్ల సరైన సమాచారం అందడం లేదని, తద్వారా గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments