Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుదునగర్‌ హైవేపై బోల్తా పడిన కారు.. ఆరుగురు మృతి

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:26 IST)
Car accident
తమిళనాడు విరుదునగర్‌లో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విరుదునగర్-మదురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివకోట్టై వద్ద టూవీలర్‌ను వేగంగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మదురైలోని విల్లాపురంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారని మదురై జిల్లా ఎస్పీ అరవింద్ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురై విల్లాపురం ప్రాంతానికి చెందిన కుటుంబీకులు గుడికి వెళ్ళి తిరిగి మదురైకి వస్తుండగా.. శివక్కోటై ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా టూవీలర్‌ వచ్చింది. దీంతో అదుపుకోల్పోయిన కారు టూవీలర్‌ను ఢీకొట్టి ఆమడదూరంలో బోల్తా పడింది. 
 
ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని శివాత్మిక (10), కనకవేల్ (61), కృష్ణకుమారి (58), పాండి (48), నాగజ్యోతి (45) ప్రాణాలు కోల్పోయారు. పాండి అనే వ్యక్తి టూవీలర్ నడిపిన వాడని తేలింది. ఇంకా అదే కారులో ప్రయాణించిన రత్నసామి, మీన, శివశ్రీ, కారు డ్రైవర్ మణికండన్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇందులో శివశ్రీ అనే ఎనిమిదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స ఫలించక ప్రాణాలు విడిచింది. తద్వారా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments