Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం... ఒకే ఫ్యామిలీలో ఆరుగురి సజీవదహనం

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (18:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కుశినగర్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో నిద్రపోతున్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. మృతుల్లో తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు ఉన్నారు. పిల్లలంతా పదేళ్ల లోపువారే. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. 
 
జిల్లాలోని ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటిబయట నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. క్షణాల్లోనే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంతలో.. లోపల ఉన్న వారి అరుపులు విన్న భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి వారిని కాపాడే ప్రయత్నం చేసినా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు. మృతులను సంగీత, బాబు(1), గీత(2), రీత(3), లక్ష్మిణ(9), అంకిత్‌(10)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితకుటుంబాన్ని అన్నిరకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.24 లక్షల ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments