Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన జాతుల మధ్య ఘర్షణ - 9 మంది మృతి

manipur violence
, బుధవారం, 14 జూన్ 2023 (12:53 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ అట్టుడుకిపోతోంది. 
 
ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మరోసారి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని సమాచారం. పలువురు గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రక్తదాతల దినోత్సవం... 13,400 కిలోమీటర్లు నడిచిన ఢిల్లీ వ్యక్తి