Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు జిల్లాలో దారుణం .. భార్య, అత్తను నరికి చంపేసిన భర్త

murderer
, ఆదివారం, 11 జూన్ 2023 (12:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను కూడా ఓ కసాయి భర్త నరికి చంపేశాడు. ఈ దారుణం జిల్లాలోని కౌతాలం మండలం, బాపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తికి కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవి అనే యువతితో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే, భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న భార్య, ఆయన అత్త హనుమంతమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాలు ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రమేష్ కోసం గాలించాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చట్ట దుర్వినియోగం అంటే ఇదే.. పెళ్లిన మూడో రోజే వేధింపులంటూ భార్య ఫిర్యాదు