Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతికి ఝులక్ ఇచ్చిన ఆరుగురు ఎమ్మెల్యేలు!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:01 IST)
బీజేపీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఆమె పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తేరుకోలేని షాక్ ఇచ్చారు. త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తామంతా పార్టీని వీడుతున్నట్టు ఆరుగురు ఎమ్మెల్యేలు సంకేతాలు పంపించారు.
 
ఆ పార్టీ ఏకైక రాజ్యసభ అభ్యర్థి రామ్‌జీ గౌతం నామినేషన్‌ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రిటర్నింగ్‌ అధికారికి నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. బీఎస్పీకి ఒక్క అభ్యర్థి గెలిచే బలం కూడా లేనప్పటికీ బీజేపీయేతర పార్టీల మద్దతుపై ఆశాభావంతో ఆ పార్టీ ఒక అభ్యర్థిని రంగంలోకి దింపింది. 
 
ఆ పార్టీ అభ్యర్థి రామ్‌జీ గౌతం నామినేషన్‌పై పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వారిలో అస్లం రైనీ, అస్లం చౌదరీ, ముజ్తబా సిద్దీఖీ, హకీం లాల్‌ బింద్‌ బుధవారం రిటర్నింగ్‌ అధికారిని కలిసి, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమతోపాటు రిటర్నింగ్‌ అధికారిని కలిశారని రైనీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments