Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్‌ కట్టడి- లాక్ డౌన్‌ను స్వాగతిస్తున్నాం.. మాయావతి

Advertiesment
కరోనా వైరస్‌ కట్టడి- లాక్ డౌన్‌ను స్వాగతిస్తున్నాం.. మాయావతి
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:30 IST)
ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే... ఆ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ''నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది'' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
ఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు.
 
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో కొవిడ్‌ -19 మహమ్మారి విజృంభిస్తోంది. 12 గంటల్లోనే కొత్తగా మరో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1666కు చేరింది. శనివారం నిర్ధారణ అయిన 92 కేసుల్లో ఒక్క ముంబై మహా నగరంలోనే 72 కేసులు నమోదుకావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాటా గ్రూపుతో చేతులు కలిపిన ఫ్లిఫ్ కార్ట్