చిక్కుల్లో ప్రజ్వల్ రేవణ్ణ - లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (14:17 IST)
ఇప్పటికే మహిళపై అత్యాచారం, వీడియో కేసుల్లో చిక్కుకుని జర్మనీకి పారిపోయిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మున్ముందు మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఆయనపై నమోదైన దౌర్జన్యం కేసులో కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లుకౌట్ నోటీసులు జారీచేసింది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి రేవణ్ణలకు నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్‌ గురువారం ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది.
 
హాసన సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసుపై నిన్న తొలిసారిగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయన్నారు. ఆయన అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ క్రమంలోనే లుక్‌అవుట్‌ నోటీసు ఇచ్చింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, విచారణకు సహకరిస్తానని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఇప్పటికే వెల్లడించారు.
 
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో దేవేగౌడ పార్టీ జేడీఎస్.. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ హాసన నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో పాటు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం