Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణ శాఖ కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్ అధికారి గిరిధర్ బాధ్యతలు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (17:03 IST)
కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి ఏ.గిరిధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకు కేంద్ర రవాణాశాఖ కార్యదర్శిగా పని చేసిన ఆయన తాజాగా మరింత కీలక శాఖ అయిన రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 
 
ఢిల్లీలోని నేషనల్ వార్ మోమోరియల్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ ఉమ్మడి ఏపీలో పలు కీలక బాధ్యతల్లో పని చేశారు. ఖమ్మం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లుగా పని చేశారు. 
 
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అంతేకాకుండా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఆయన విధులు నిర్వహించారు. ఆ తర్వాతి కాలంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. కేంద్రంలో తొలుత కేబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా పని చేశారు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ కీలక స్థాయికి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments