Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లీజుకు రైల్వే స్థలాలు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం

Advertiesment
railway lands
, బుధవారం, 7 సెప్టెంబరు 2022 (16:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రమంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికిదాగా రైల్వే భూములను లీజుకు ఇచ్చే అవకాశమే లేకపోగా తాజాగా ఈ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకునే వెసులుబాటును కేంద్ర మంత్రివర్గం కల్పించింది. 
 
ప్రధానంగా పీఎం గ‌తి శ‌క్తి యోజ‌న‌కు నిధులు స‌మ‌కూర్చుకునేందుకు రైల్వే స్థ‌లాల‌ను లీజుకు ఇవ్వాల‌ని కేంద్ర కేబినెట్ నిర్ణ‌యించింది. ఇక పీఎం శ్రీ పేరిట స‌ర్కారీ స్కూళ్ల మెరుగుద‌ల‌కు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్ర‌క‌టించిన నూతన ప‌థ‌కానికి కూడా కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదముద్ర వేసింది. 
 
వచ్చే ఐదేళ్ల‌లో 14 వేల స్కూళ్ల‌ను రూ.23 వేల కోట్లతో అభివృద్ధి చేయాల‌ని మంత్రివ‌ర్గం తీర్మానించింది. ఈ పథ‌కం ద్వారా దేశ‌వ్యాప్తంగా 18 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంద‌ని కేబినెట్ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరసకు మామయ్య.. అయినా చాటింగ్ చనువు.. గర్భవతిని చేశాడు.. చివరికి?