Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోమంటారా? కేంద్ర మంత్రి

Webdunia
గురువారం, 13 మే 2021 (19:55 IST)
కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడంలోనూ, దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందజేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర మంత్రులు నిగ్రహం కోల్పోతున్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ కొరతపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ తీవ్ర స్థాయిలో స్పందించారు. కోర్టులు ఆదేశించిన పరిమాణంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేకపోతే పాలకులు ఉరేసుకోవాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందాలని కోర్టు చెప్పడం మంచి ఆలోచనే. అయితే రేపు అదే కోర్టు పలానా సంఖ్యలో వ్యాక్సీన్లు ఇవ్వాలంటూ చెబితే... అన్ని వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేనందుకు మేము ఉరేసుకోవాలా?' అని మంత్రి ఆక్రోశం వెళ్లగక్కారు.\\
 
వ్యాక్సీన్ పంపిణీపై ప్రభుత్వానికి ఓ కార్యాచరణ ప్రణాళిక ఉండాలనీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాలన్నారు. అక్కడక్కడా వ్యాక్సీన్లు కొరత ఏర్పడటం వాస్తవమే అయినప్పటికీ... వాక్సీన్ల పంపిణీ కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా, నిజాయితీగా పనిచేస్తోందని సదానంద పేర్కొన్నారు. 
 
'ఆచరణలో కొన్ని విషయాలు మన పరిధికి ఆవల ఉంటాయి. వాటిని మనం అదుపు చేయగలమా?' అని ఆయన ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వ్యాక్సీనేషన్ ప్రక్రియకోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందనీ.. కొద్దిరోజుల్లో వ్యాక్సినేషన్ పరిస్థితి మెరుగుపడుతుందని సదానంద ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments