Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడి వివాహితపై అత్యాచారం.. గర్భందాల్చిన బాధితురాలు

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (09:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడు ఓ 50 యేళ్ళ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయి విధవరాలిగా ఉన్న ఆ మహిళ గర్భందాల్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్నోకు సమీపంలోని కోత్వాలికి చెందిన అఖిలేష్‌ అహిర్వర్‌ అనే వ్యక్తి గత నెల డిసెంబర్‌ 7వ తేదీన ఓ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీనిపై నిందితుడ్ని నిలదీయగా చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments