Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల 24 గంటల్లో... : బీజేపీకి ఆ పవార్ ఒక్కరే అండ - ఈ పవార్ చెంత 53 మంది ఎమ్మెల్యేలు

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:31 IST)
మహారాష్ట్రలో తెల్లవారకముందే కొలువుదీరిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి మరో 24 గంటలపాటు ఊరట లభించింది. ఫడ్నవిస్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకునే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది.
 
అయితే, బీజేపీకి శివసేన మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్‌ను మినహాయిస్తే మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెంట ఉన్నట్టు తేలిపోయింది. 
 
అజిత్ పవార్‌తో ఏ ఒక్కరూ లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రాంలో బీజేపీ నిర్భంధంలో ఉన్న నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకున్నారని.. వారు తమతోనే ఉన్నారని ఎన్సీపీ చెప్పింది. అనిల్ పాటిల్, బాబాసాహెబ్ పాటిల్, దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్‌లను బీజేపీ గురుగ్రాంలో ఇన్నాళ్లూ నిర్భంధించిందని ఎన్సీపీ ఆరోపించింది.
 
కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే అన్నా బన్సోడే కూడా పుణెలో ఉన్నట్లు తెలిసిందని.. త్వరలో తమ వద్దకు వస్తారని ఎన్సీపీ తెలిపింది. ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని.. తమకు 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సదరు పార్టీలు దీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బల పరీక్షపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments