Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25 కోట్ల వ్యయంతో సీఎం రమేష్ తనయుడి నిశ్చితార్థం..(Video)

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఓ అంశంపై తెగ చర్చ సాగుతోంది. అదే... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం. ఈ వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదిక ఆపరేషన్ ఆకర్ష్‌కు వేదిక అయిందనే ప్రచారం సాగుతోంది. 
 
రిత్విక్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్‌ను వాడుకుందనే రూమర్స్ విస్తృతంగా వ్యాపించాయి. 
 
ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని అమ్మో.. బాపుగారి బొమ్మో.. సాంగ్‌కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారట. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments