Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటులో మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (18:19 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌కు గాయమైంది. పార్లమెంటులో మెట్లు దిగుతూ జారి కిందపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. బుధవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సమావేశాలకు హాజరైన ఆయన... మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స చేశారు. కాలికి బ్యాండేచ్ వేయించుకుని తన నివాసానికే పరిమితమయ్యారు.
 
ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గ కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, థరూర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments