పార్లమెంటులో మెట్లు దిగుతూ జారిపడిన శశిథరూర్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (18:19 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌కు గాయమైంది. పార్లమెంటులో మెట్లు దిగుతూ జారి కిందపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. బుధవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సమావేశాలకు హాజరైన ఆయన... మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స చేశారు. కాలికి బ్యాండేచ్ వేయించుకుని తన నివాసానికే పరిమితమయ్యారు.
 
ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గ కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, థరూర్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments