Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను : స్పష్టతనిచ్చిన శరద్ పవార్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (13:19 IST)
వచ్చే నెలలో దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈలోగానే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సివుంది.

ఈ పరిస్థితుల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, కురువృద్ధ రాజకీయ నేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. వదీంతో ఆయన ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా విపక్షాల తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రచారానికి ఆయన మంగళవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని స్పష్టంచేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 
 
నిజానికి విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనను శరద్ పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని సులభంగా గెలిపించుకునే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేపు. ఈ కారణంగానే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments