Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను : స్పష్టతనిచ్చిన శరద్ పవార్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (13:19 IST)
వచ్చే నెలలో దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈలోగానే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సివుంది.

ఈ పరిస్థితుల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, కురువృద్ధ రాజకీయ నేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. వదీంతో ఆయన ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా విపక్షాల తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రచారానికి ఆయన మంగళవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని స్పష్టంచేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 
 
నిజానికి విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనను శరద్ పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని సులభంగా గెలిపించుకునే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేపు. ఈ కారణంగానే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments