డాడీ వస్తున్నారంటే వణికిపోతూ మంచం కింద దాక్కునేదానిని... స్వాతి

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (10:18 IST)
తన తండ్రి వస్తున్నారంటే భయంతో వణికిపోతూ మంచం కింద దాక్కునేదానిని అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్యంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇపుడు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
శనివారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, తాను కూడా లైంగిక వేధింపులు బాధితురాలినేనని చెప్పారు. తాను 4వ తరగతి చదువుతున్న సమయంలో మేం ఆయనతో కలిసే ఉన్నామని చెప్పారు. ఆయన తనను అకారణంగా కొట్టేవారని తెలిపారు. కొన్నిసార్లు రక్తస్రావం కూడా వచ్చేదని గుర్తు చేశారు. తన తండ్రి ఇంటికి వస్తున్నారంటూ భయంతో వణికిపోయేవాళ్ళం. ఆయన లైంగిక వేధింపులు భరించలేక పలుమార్లు మంచం కింద దాక్కున్నానని స్వామి తెలిపారు. 
 
కాగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 8 ఏళ్ల వయసులోనే తాను తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తనకు 15 ఏళ్ల వచ్చాక తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టానని, ఆ తర్వాత ఏడాదికే ఆయన తమను వదిలేసి వెళ్లిపోయారని ఖుష్బూ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం