Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో జయ, కరుణ.. ఇద్దరూ కలిసిపోయారు..

తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:22 IST)
తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీరిద్దరూ నువ్వా నేనా అంటూ రాజకీయాల్లో పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు రాణించేందుకు సంసిద్ధమయ్యేవారు. కానీ చివరికి ఈ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం కలిసిపోయారు. కానీ ఇది యాదృచ్చికంగా జరిగిపోయింది. 
 
అదేంటంటే.. తమిళనాడుకు దశాబ్దాల పాటు సేవలందించిన జయలలిత, కరుణానిధిలు పాల్గొన్న చివరి కార్యక్రమాలు ఒకే నెలలో జరిగాయి. 2016లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న జయలలిత సెప్టెంబర్ 21న చెన్నైలో జరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లిటిల్ మౌంట్ నుంచి విమానాశ్రయం వరకూ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఆపై ఆమె బయట మరెక్కడా కనిపించలేదు. చివరికి డిసెంబర్ 5వ తేదీ 2016లో ఆమె అపోలోలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా బయట చివరిసారిగా కనిపించింది అదే సంవత్సరం అదే నెల కావడం గమనార్హం. 2016 సెప్టెంబర్ 17న చెన్నైలోని అన్నా అరివాలయంలో ''డీఎంకే ముప్పెరుం విళా'' జరుగగా, కరుణానిధి పాల్గొని తన సహజత్వానికి భిన్నంగా భావోద్వేగంతో ప్రసంగించారు. తాను పాల్గొనే చివరి వేడుక ఇదేనని చెప్పారు. ఆ మరుసటిరోజు అక్కడే జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశమైన ఆయన, ఆపై ఇంటికే పరిమితం అయ్యారు. వీరిద్దరూ 2016 సెప్టెంబర్ తరువాత బయటి ప్రపంచంలోకి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments