Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు తర్వాతే మూతపడిన స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్: మంత్రి రమేష్

Schools
Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (17:26 IST)
ఆగస్టు తర్వాతే మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు తర్వాతే రీ-ఓపెన్ చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. 
 
జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు జరిగిన పరీక్షలతోపాటు ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలను ఆగస్టు 15లోగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
 
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 5వ దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 5లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు, కాలేజీలను 30 శాతం అటెండెన్స్‌తో జులైలో రీఓపెన్ చేస్తారని, 8వ తరగతిలోపు స్టూడెంట్స్ ఇళ్ల దగ్గరే ఉంటారని భావించారు. 
 
అలాగే గ్రీన్, ఆరెంజ్ జోన్స్‌లోనూ విద్యా సంస్థలు మళ్లీ తెరుస్తారని.. భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ అటెండెన్స్‌తో రెండు షిఫ్ట్స్ మధ్య క్లాసుల నిర్వహణ ఉంటుందని అనుకున్నారు. కానీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పట్లో స్కూళ్లు, పాఠశాలలు తెరిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments