Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 తర్వాతే విద్యాలయాలు పునఃప్రారంభం: స్పష్టత ఇచ్చిన కేంద్రం

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:58 IST)
దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.

మార్చిలోనే స్కూళ్లకు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది చర్చనీయాంశంగా మారింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తుండగా, కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
 
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.

ఈ లోపు అన్ని వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా, ఏపీలో స్కూళ్లను ఆగస్టు 3న తెరవాలని సర్కారు నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments