Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో వాయు కాలుష్యం-మళ్లీ మూతపడనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (18:03 IST)
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వేధిస్తుంది. ఇప్పటికే కరోనా ఒకవైపు... వాయు కాలుష్యం మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో వాయు కాలుష్య సంక్షోభం కారణంగా ఢిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. దీంతో సోమవారమే ప్రారంభమైన పాఠశాలలు మళ్లీ మూతపడనున్నాయి.
 
ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడంపై సుప్రీం ఢిల్లీ సర్కారుపై ఫైర్ అయ్యింది. 
 
మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు.. ఇదేంటి అంటూ సుప్రీం కోర్టు మందలించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా సుప్రీంకు వివరణ ఇచ్చింది. 
 
గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని పాఠశాలలు తెరిచామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. దీంతో పాఠశాలలు మూతపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments