Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సర్కార్" సినిమా బాటలో కేంద్ర ఎన్నికల సంఘం...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (19:24 IST)
గత ఏడాది తమిళ, తెలుగు భాషలలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయికగా నటించారు. ఈ సినిమా అనేక వివాదాలను కూడా తెచ్చిపెట్టింది. 
 
తమిళనాడులోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సీన్లు ఉన్నాయని రచ్చ జరగడంతో పాటుగా డైరెక్టర్ మురుగదాస్ మీద కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ప్రతినాయిక పాత్ర పేరు కోమలవల్లి, ఇది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కావడంతో మరో వివాదం రాజుకుంది.
 
ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం ప్రజలకు తెలిసేలా చేసాడు మురుగదాస్. అదే 49పి సెక్షన్. సర్కార్ సినిమాలో హీరో విజయ్ ఓటును ఎవరో దొంగ ఓటు వేస్తారు. తన ఓటును ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న హీరో కోర్టులో కేసు వేసి, 49పి ద్వారా తిరిగి తెచ్చుకుంటాడు. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా ఈ 49పి సెక్షన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ విషయం గురించి మురుగదాస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments