Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:18 IST)
నెలకు కేవలం 15 వేల రూపాయలను సంపాదించే ఓ పారిశుద్ధ్య కార్మికుడుకి ఆదాయపన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఏకంగా రూ.34 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను స్వీకరించిన ఆ కార్మికుడు ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన కరణ్ కుమార్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి ఆదాయపన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి. కానీ, వాటిలో ఏముందో అతడికి అర్థంకాకపోవడంతో విద్యావంతులను అడిగి అసలు విషయం తెలుసుకుని ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. 
 
2019-20లో కరణ్ రూ.34 కోట్ల ఆదాయాన్ని అర్జించాడు. ఆ యేడాదికి ఎలాంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు" అని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలోని ఖైర్‌లో ఉన్న ఎస్.బి.ఐ శాఖలో పారిశుద్ధ్యం కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తన జీతం నెలకు రూ.15 వేలు మాత్రమేనని వెల్లడించారు. అతని పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల అలీగఢ్‌కు చెందిన జ్యూస్ సెంటర్ వ్యాపారికి రూ.7.5 కోట్లు చెల్లించాలని నోటీసులు అందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments