Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

Advertiesment
Rape

సెల్వి

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:11 IST)
అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది. అయోధ్య లోని రామజన్మ భూమి గుడి కాంప్లెక్స్‌లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాకుండా మూడు సార్లు యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. 
 
అయోధ్య జిల్లాలోని సహదత్‌గంజ్‌కు చెందిన వంశ్‌ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ..తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న తనను గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. 
 
అతను, తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగికదాడి చేశాడని.. ఆపై తన స్నేహితులైన వినరు కుమార్‌, మహ్మద్‌ షరీక్‌లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. 
 
ఇలా మరో మూడుసార్లు జరిగిందని.. బయట చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు. మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 
కాగా బాధితురాలు అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బీఏ విద్యార్థినిగా చదువుతూ.. ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం