Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రజల అకౌంట్లో డబ్బులు జమచేస్తున్నారట.. పోస్టాఫీసుకు పరుగులు

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (08:41 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ప్రజలను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. మోదీ సర్కారు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.25 వేల నుంచి రూ.15లక్షల వరకు జమ చేస్తుందని ప్రచారం జరగడంతో పోస్టాఫీసుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు ప్రజలు. అవన్నీ వదంతులేనని.. వాటిని పట్టించుకోవద్దునని చెప్పినా.. వినిపించుకోవట్లేదు. 
 
ఈ ఘటన బీహార్‌లోని మోతీహారి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో ఆ ప్రాంతం జాతరలా కనిపించింది. మహిళలు, పురుషులకు ప్రత్యేక క్యూలు వున్నాయి. ఈ క్యూల్లో ప్రజలు గంటల కొద్దీ నిలబడి.. ఖాతాలు తెరిచారు. కాగా ప్రధాని మోదీ అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments