Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయన అహాన్ని తృప్తి పర్చేందుకే సార్ అని పిలిచా : చంద్రబాబు

Advertiesment
Chandrababu Naidu
, గురువారం, 31 జనవరి 2019 (14:58 IST)
అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని కలిసిన సందర్భంలో కూడా మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించాననీ... సార్ అని ఎప్పుడూ పిలవలేదని పేర్కొన్నారు. 
 
నిజానికి నరేంద్ర మోడీ రాజకీయాలలో తన కంటే జూనియర్ అయినప్పటికీ ఆయనని సార్ అని పిలిచేవాడిననీ వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీ అహాన్ని సంతృప్తి పరిచేందుకు తాను సార్ అని పిలిచాననీ వ్యాఖ్యానించడం విశేషం. 
 
2014లో రాష్ట్రానికి భాజపా న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని చెప్తున్న ఆయన.. పొత్తు లేకుంటే మరో 10 సీట్లు ఎక్కువగానే వచ్చి ఉండేవని వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచాయి. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తే వెనుకటి బద్దెన రచించిన సుమతి శతకంలో ఒక పద్యం... 'కూరిమి గల దినములలో' అనే పద్యం గుర్తొస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలవు పెట్టకుండా పనిచేశాడు.. రూ.19.4 కోట్లు పొందాడు.. ఎలా?